ఎన్టీఆర్ , విరాట్ కోహ్లీ వీరిద్దరూ కలిసి ఒకే స్టేజి మీద కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధలు ఉండవు. ఎవరి రంగంలో వారు ఉద్ధండులు.. కలిసి కనిపిస్తే అభిమానులకు కన్నులపండగే.  త్వరలో అది జరగబోతోందని టాక్.  ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ ఎన్డీటీవీ వారు 'రోడ్ అండ్ ఆల్కాహాల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్' ను ప్లాన్ చేస్తున్నారట. ఇందులోనే ఎన్టీఆర్.. విరాట్ కొహ్లి భాగస్వాములు అయ్యే అవకాశం ఉందని సమాచారం.


ప్రజలలో రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించేందుకు.. డ్రంక్ డ్రైవింగ్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ వారిని బాధ్యతాయుతంగా ఉండేలా ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమం ఉంటుందట.  ఎన్టీఆర్.. విరాట్ తో పాటు వివిధరంగాలకు చెందిన మరో ఏడుగురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారట. ప్రజలకు మేలు కలిగేది కావడంతో ఈ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.


  మరి ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది?  అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఉంటుందా.. లేదా మరేదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేశారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.  త్వరలోనే దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని సమాచారం.  ఏదేమైనా ఎన్టీఆర్.. విరాట్ కలిసి కనిపిస్తే మాత్రం వారు అందరి దృష్టిని ఆకర్షిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: