యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో కల్కి సినిమా చేస్తున్నారు. ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాయి. అ! సినిమాతో ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ కల్కి కూడా కచ్చితంగా హిట్టు కొట్టేలా ఉన్నాడు. అయితే రిలీజ్ ముందు ఈ సినిమా కథ తనదంటూ ఓ రైటర్ గొడవకు దిగాడు. 


కార్తికేయ అలియాస్ ప్రసాద్ ఇదివరకు రాజశేఖర్ కోసం మహంకాళి సినిమా కథ అందించాడు. అతనే రాజశేఖర్ కు కల్కి కథ చెప్పాడట. ఈ కథనే కొద్దిగా మార్చి కల్కి సినిమా చేస్తున్నారని అంటున్నాడు కార్తికేయ. 2009లోనే తాను రైటర్స్ అసోషియేషన్ లో ఆ కథ రిజిస్టర్ చేయించానని అంటున్నాడు కార్తికేయ.


రైటర్స్ అసోషియేషన్ లో కల్కి సినిమాపై కంప్లైంట్ కూడా ఇచ్చానని అయితే సినిమాకు సంబందించి ఎవరు దీనిపై మాట్లాడేందుకు రావట్లేదని అంటున్నాడు కార్తికేయ. తనకు డబ్బులు అవసరం లేదని రైటర్ గా తన పేరు వేస్తే చాలని అంటున్నాడు. తను రిజిస్టర్ చేయించిన కథ వివరాలు ఉన్నాయని అంటున్నాడు.


గరుడవేగ తర్వాత రెండేళ్లకు కల్కితో వస్తున్నాడు రాజశేఖర్ మరి ఈ సినిమా రిలీజ్ ముందు ఇలాంటి గొడవ రావడం షాకింగ్ గానే ఉంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్స్ గా నటించారు. సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమాతో రాజశేఖర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: