టాలీవుడ్ లోకి ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చి తర్వాత డైరెక్టర్లుగా మారారు.  మరికొంత మంది హీరోలుగా మారారు..అలాంటి వారిలో రవితేజ,నాని, రాజ్ తరుణ్.  ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక్క కుదుపు కుదిపేసిన మూవీ ‘శివ’. గ్యాంగ్ వార్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ‘శివ’సినిమాను తీర్చిదిద్దారు రాంగోపాల్ వర్మ. అయితే రాంగోపాల్ వర్మ ఈ మూవీ తీసే సమయంలో ఎంతో మంది ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు.

అలాంటి వారిలో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఒకరు.  వర్మ, పూరి మద్య ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది. తాజాగా ఓ జ్ఞాపకాన్ని దర్శకుడు ఆర్జీవీ ఓ సారి గుర్తు చేసుకున్నాడు.  అక్కడ బ్లూ షర్ట్ లో కనిపిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడున్న సూపర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటూ.. హే జగన్ వాటే జర్నీ అని పేర్కొన్నాడు.

అందుకు దర్శకుడు పూరి కూడా యస్ సర్.. అంటూ సరదాగా గురు భక్తిని చాటుకున్నాడు. ఈ పాట ఇప్పటి వరకు ఎంతో మంది చూసినా వర్మ చెప్పే వరకు ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడం విశేషం. ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూరి జగన్నాధ్ తనయుడు ప్రస్తుతం ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: