సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి సినిమా మరొక రెండురోజుల్లో సక్సెస్ఫుల్ గా 50 రోజలు 200 కేంద్రాల్లో పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఈనెల 28న 50 రోజుల వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. మొదట్లో కాస్త మిశ్రమ స్పందనను రాబట్టిన ఈ సినిమా, 

మెల్లగా ప్రేక్షకుల మెప్పుతో అదిరిపోయే కలెక్షన్లతో సూపర్ హిట్ గా ముందుకు దూసుకెళ్లింది. కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నా వివరాల ప్రకారం రూ.100 కోట్ల షేర్ ఎప్పుడో దాటేసిన ఈ సినిమా క్లోసింగ్ సమయానికి మరింత కలెక్షన్ రాబడుతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం తలపెట్టిన 50 రోజుల వేడుకకు ముందస్తుగా ఏర్పాట్లు హై స్పీడ్ లో చేస్తున్నారట. ఇకపోతే ఈ వేడుకకు కొందరు సినీ ప్రముఖులు కూడా రానున్నారని, అయితే వారిలో ప్రత్యేక అతిథిగా నాచురల్ స్టార్ నాని రానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ విషయమై మహర్షి నిర్మాతలు నానిని సంప్రదించగా, అయన తప్పకుండా వస్తానని మతిచ్చారట. 

కొన్నేళ్ళక్రితం నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమా ఆడియో ఫంక్షన్ కు సూపర్ స్టార్ మహేష్ అతిథిగా హాజరై, ఆ ఫంక్షన్ కు మంచి జోష్ తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం నాని, మహేష్ బాబు ఫంక్షన్ కు రానుండడంతో ఈ ఫంక్షన్ తప్పకుండా మంచి విజయవంతం అవుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మహర్షి సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: