ఆగష్టు 15 వ తేదీ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు.  ఎర్రకోటపై ప్రధాని జెండా ఎగురవేస్తారు.. దేశం గురించి ఎర్రకోటపై ఆయన మాట్లాడతారు.  అందరు అన్ని ప్రాంతాల్లో జెండా వందన కార్యక్రమాలు జరుగుతుంటాయి.  ఇక్కడ ఇలాంటి హడావుడి ఉంటె... 


సినిమా ఇండస్ట్రీలో మరో హడావుడి ఉంటుంది.  ఆరోజున బాలీవుడ్ లో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  మూడు పెద్ద సినిమాలే.  అందులో ఒకటి ప్రభాస్ సాహో.  బాహుబలి తరువాత ప్రభాస్ కు డిమాండ్ పెరిగింది.  సాహో సినిమాను హిందీలో టి సీరీస్ సంస్థ రిలీజ్ చేస్తున్నది.  


దీంతో పాటు అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ రిలీజ్ కాబోతున్నది.  మార్స్ పైకి మామ్ ఉపగ్రహాన్ని ఇండియా పంపింది.  దీనిని బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.  ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దేశానికీ సంబంధించిన సినిమా కావడంతో పాటు అక్షయ్ కుమార్ హీరో.  ఇందులో బాలీవుడ్ కు చెందిన అనేకమంది నటీనటులు నటిస్తున్నారు.  


మూడో సినిమా బద్లా హౌస్.   క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.  జాన్ అబ్రహం హీరో.  ఈ మూవీని కూడా టి సిరీస్ సంస్థ నిర్మించింది.  దీనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.  మరి ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: