ప్రభాస్ సాహో ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ తరువాత జాన్ సినిమాపై దృష్టి పెడతారు. జాన్ షూటింగ్ కూడా కొంతవరకు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోనే భారీ సెట్ వేశారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాన్ ప్రభాస్ 20 వ సినిమా. ఈ మూవీ తరువాత సినిమా కూడా లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ వద్దకు ఓ కథ వచ్చిందని, ఆ కథ విని దానిని లాక్ చేశారని సమాచారం. కథ బాగుండటంతో.. వచ్చే సోమా లేదంటే బుధవారం రోజున ప్రభాస్ కు కథ వినిపిస్తారని తెలుస్తోంది.
ప్రభాస్ ఒకే అంటే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యి అంతా సిద్ధం కావడానికి కొంచెం సమయం పడుతుంది. ఇది కూడా పాన్ ఇండియా కథే కావడం విశేషం. మొదట ఈ కథ కేజీఎఫ్ స్టార్ యాష్ వద్దకు వెళ్ళింది. యాష్ కథను విని తనకు సెట్ కాదని, ఇలాంటి కథను డీల్ చేయాలంటే ప్రభాస్ ఒక్కరికే సాధ్యం అవుతుందని చెప్పాడట.
యాష్ రికమండ్ చేయడంతో యూవీ క్రియేషన్స్ సంస్థ కథను విన్నది. నచ్చడంతో లాక్ చేసింది. ప్రభాస్ ఒకే చెప్పడమే ఆలస్యం. ఇంతకీ ఆ కన్నడ దర్శకుడు ఎవరు.. ఏంటి అన్నది సస్పెన్స్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా చేయాల్సి ఉన్నా దానికి చాలా సమయం పట్టేలా ఉన్నది.