ఈ మధ్య కాలంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చాడు తేజ. దీంతో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తాడని భావించారు ఆయన అభిమానులు. కానీ మొన్న కాజల్ అగర్వాల్ లీడ్ గా పెట్టి తీసిన సీత సినిమా నిరాశపరచింది. దీంతో ఇన్ని రోజులు కాస్త సైలెంట్ గా ఉన్న ఆయన మల్లె స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో పడ్డాడని సమాచారం. ఈసారి ఆయన మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని, అది కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉండదనుందని అంటున్నారు.

 

స్క్రిప్ట్ ఇప్పుడే మొదలు పెట్టడంతో పూర్తి చేయడానికి టైం పడుతుందని, ఈసారి కధలో కొత్తదనం ఉండేలా తేజ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. తేజ కోసం కొందరు నిర్మాతలు ట్రై చేస్తున్నారని కానీ ఆయన ఈసారి తొందర పడకుండా పక్కాగా ఉండేలా స్క్రిప్ట్ రాస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఈసారి అయినా హిట్ కొడతారేమో ? ఈమధ్య ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆయన షేర్ చేసుకున్న పర్సనల్ మేటర్స్ చాలా వైరల్ అయ్యాయి.

 

"నా కొడుకుకోసం ఇంటినే హాస్పటల్‌గా మార్చేశాం. నాలుగేళ్లు పాటు సరిగా నిద్రపోలేదు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో ఇద్దరిద్దరు నర్సులు ఉండేవారు. ఒక డ్రైవర్ ఉండేవారు. ఆక్సిజన్ మిషన్, జనరేటర్, క్లీనింగ్ మిషన్ వీటన్నింటితో హాస్పటల్‌గా ఉండేది మా ఇళ్లు. నేను పగలు పడుకుంటే ఆ టైంలో నా భార్య ఉండేది. ఆమె పడుకుంటే నేను ఉండేవాడిని. ఇలా రాత్రి పగలూ నేను, నా భార్య చాలా కష్టపడ్డాం. బ్యాడ్ లక్ నా కొడుకు దక్కలేదు." అని చెప్పిన విషయాలు వీక్షకులను కన్నీరు కార్చేలా చేసాయి.

 

తేజ మొదటి నుండి.. ముక్కుసూటి మనిషి.  ఎవరికి ఇబ్బంది లేకుండా, వున్నది ఉన్నట్లు మాట్లాడే మృదు స్వభావి. ఇక తేజ సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘సీత’ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.  మొన్నటివరకు ఓ యంగ్ హీరోతో సినిమాకి ప్లాన్ చేశారు అన్నట్టు వార్తలొచ్చిన, పర్సెంట్ ఈ టాక్ తో అది రూమర్ అని అర్ధం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: