ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. దీని తర్వాత ఏ మూవీ చేస్తాడనే క్లారిటీ లేదు కానీ రెండేళ్ల క్రితం వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ లో బాలయ్య నటించే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్.

 

హక్కులు గతంలోనే కొన్న దిల్ రాజు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.ఇదే సినిమాని తమిళ్ లో అజిత్ హీరోగా జెర్సి ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ కీలక పాత్ర రీమేక్ చేశారు. వచ్చే నెల విడుదల కానుంది. తెలుగులో తీయాలంటే సీనియర్ అయితేనే బాగుంటుంది. అందుకే తన బ్యానర్ లో ఇప్పటిదాకా చేయని బాలయ్యే దిల్ రాజుఁ మనసులో ఉన్నట్టు చెబుతున్నారు.

 

బాలకృష్ణ తెరమీద నల్లకోటు వేసి 27 ఏళ్ళు అయ్యింది. చివరిసారిగా ఫుల్ లెన్త్ రోల్ లాయర్ గా కనిపించింది 1992లో వచ్చిన ధర్మక్షేత్రంలో. అది అప్పట్లో పెద్ద డిజాస్టర్. మ్యూజికల్ గా మాత్రమే పేరొచ్చింది. ఆ తర్వాత బాలయ్య కోర్టు జోలికి వెళ్ళిందే లేదు. మరి ఇప్పుడీ పింక్ రీమేక్ ని ఒప్పుకుంటాడా అంటే చెప్పలేం.

 

మాస్ హీరోయిజంని ఎలివేట్ చేసే పాత్రల్లోనే చూసిన బాలయ్య పింక్ తరహాలో మరీ సీరియస్ గా ఉంటె చూడటం కష్టమే. ఒకవేళ తమిళ వెర్షన్ హిట్ అయ్యి అందులో అన్ని అంశాలు సరిగ్గా పొందుపరిచారు అనిపిస్తే అప్పుడేమైనా నిర్ణయం తీసుకోవచ్చేమో. అసలీ ప్రతిపాదన ఇంకా బాలయ్య దగ్గరికి వెళ్లిందో లేదో కూడా డౌటే.


మరింత సమాచారం తెలుసుకోండి: