ప్రభాస్ ‘సాహో’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో పాటను పూర్తి చేశారు. ఇక మిగిలిన బ్యాలన్స్ వర్క్ కూడా అతి త్వరలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం మొదటి పాటను జులై 8న విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. సైకో సయ్యాన్ అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఆ పాటకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు.

 

ప్రభాస్ మరియు శ్రద్దా కపూర్ లపై చిత్రీకరించిన ఈ పాట కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పాటను హైదరాబాద్ లోని ఒక మల్టీప్లెక్స్ లో ప్రభాస్ స్పెషల్ ఫ్యాన్స్ అయిన 300 మందికి ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. విడుదలకు ముందే అంటే యూట్యూబ్ లో విడుదలకు ముందే మల్టీప్లెక్స్ లో ఆ ప్రత్యేక అభిమానులు ఈ పాటను చూడబోతున్నారు.

 

ఆ 300 మంది ఫ్యాన్స్ ఎవరనే విషయంపై ఆదివారం వరకు క్లారిటీ రానుంది. సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇలా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

 

మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15వ తారీకున సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్స్ తో ఈ చిత్రం ఉంటుందని.. బాలీవుడ్ సినిమాలను తలదన్నే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: