సావిత్రిగా పాపులర్ అయిన వి6 యాంకర్ జ్యోతి కొద్ది రోజుల క్రితం ఆ ఛానెల్ నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత కొన్నాళ్లు తెర‌మీద కూడా హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇక ఇప్పుడు త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌య్యే బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె వీ 6 నుంచి త‌ప్పుకున్న‌ట్టు చెపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ షో త‌ర్వాత వ‌చ్చే పాపులార్టీతో ఆమె సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా వున్నట్లు ఆమె ప‌నిచేసిన ఛానెల్ వ‌ర్గాల టాక్‌.


బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేందుకే ఈ యాంక‌ర‌మ్మ వీ6కు రాజీనామా చేసిందంటున్నారు. యాజ‌మాన్యం మూడు నెల‌లు సెలవు ఇస్తామ‌ని చెప్పినా కూడా ఈ షో త‌ర్వాత ఆమెకు ఈ ఛానెల్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం లేద‌ని.. అందుకే ఆమె రాజీనామా చేసింద‌ని అంటున్నారు. ఈనెల 21 నుంచి బిగ్ బాస్ 3 సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ షో మూడునెలల పాటు వుంటుంది. 


ఇప్పటికే సావిత్రితో పాటు షో చేస్తున్న బిత్తిరి సత్తి సినిమాల్లో కూడా న‌టిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే సావిత్రి అలియాస్ జ్యోత‌క్క కూడా ఇదే బాట‌లో న‌డ‌వాల‌ని ప్లాన్ చేసుకుంద‌ట‌. ఇక వీ 6లో బిత్తిరి స‌త్తిరితో క‌లిసి నానా ర‌చ్చ చేసే ఈ యాంక‌ర‌మ్మ ఇప్పుడు షోలో హోస్ట్ నాగార్జున‌తో క‌లిసి ఏ రేంజులో ర‌చ్చ చేస్తుందో ?  తోటి కంటెస్టెంట్ల‌తో ఎలా ఆడుకుంటుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: