అమితాబ్ సూపర్ స్టార్ గా ఎదగడం వెనుక ఎంతటి కష్టం ఉందొ చెప్పక్కర్లేదు. స్టార్ గా మారడానికి పడిన కష్టం అంతాఇంతాకాదు. అందుకే ఎలాంటి పాత్ర వచ్చినా అవలీలగా చేస్తుంటారు. అప్పట్లో హీరోగా చేసినా... ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు.
కావాలనుకుంటే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అలా రెస్ట్ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి రేట్ తీసుకోవడం లేదు. వచ్చిన ప్రతి సినిమా చేస్తున్నాడు. ముఖ్యంగా సౌత్ లో వచ్చే ఆఫర్లను కాదనుకోవడం లేదు. అవకాశాలని వినియోగించుకుంటున్నారు అమితాబ్.
అమితాబ్ బాలీవుడ్ లో పింక్ సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ ని కోలీవుడ్ లో నెర్కొండ పార్వై పేరిట అజిత్ రీమేక్ చేస్తున్నారు. బోనికపూర్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. దీనిపై అంచనాలు ఉన్నాయి.
పింక్ సినిమా టాలీవుడ్ రైట్స్ ను దిల్ రాజు తీసుకున్నారు. దిల్ రాజు ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయించి బాలకృష్ణతో చేద్దామని అనుకుంటున్నారట. బాలకృష్ణ అయితే బాగుటుందని రాజు అభిప్రాయం. పైగా దిల్ రాజు నిర్మాణంలో బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి దీనికి బాలకృష్ణ అంగీకరిస్తారా చూడాలి.