టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్ లో 25వ సినిమాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మహర్షి. గత మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి సినిమా, సూపర్ డూపర్ హిట్ కొట్టి, అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ రేంజ్ కి చేరుకుంది. ఇక మొదటినుండి సూపర్ కలెక్షన్స్ తో తన ప్రభంజనాన్ని ప్రారంభించిన మహర్షి, నిన్న మొన్నటివరకు ఆ హవాను కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇటీవల 200 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు వేడుక జరుపుకున్న ఈ సినిమా, ఓవర్ ఆల్ గా రూ.108 కోట్ల మేర కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. 

ఇప్పటివరకు చూసుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి బాహుబలి 2 ముందంజలో ఉండగా, దాని తరువాత బాహుబలి 1, ఇక దాని తరువాత రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూడవ స్థానంలో నిలిచాయి. అయితే ఇప్పటివరకు రూ.105 కోట్లతో నాలుగవ స్దానం లో నిలిచిన మెగాస్టార్ మెగా మూవీ ఖైదీ నెంబర్ 150ని తలదన్ని రూ.108 కోట్లతో మహర్షి నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి రోజు కాస్త మిశ్రమ స్పందనను రాబట్టిన మహర్షి, రెండవ రోజునుండి పుంజుకుని, ప్రతి ప్రేక్షకుడి మనసు దోచి, 

చివరకు ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నాడని మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికల్లో తమ అబిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. ఇక ఈ సినిమా అద్భుత విజయం ఇచ్చిన ఊపులో ప్రస్తుతం మహేష్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ను మొదలెట్టడం జరిగింది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమా పై కూడా మంచి అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: