సాధారణ మహిళలను నుంచి చివరికి హీరోయిన్స్ కూడా రక్షణ లేకపోవటం మన దురదృష్టంగా చెప్పుకోవాలి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా పబ్లిగ్గా సెక్సువల్ హరాస్మెంటుకు గురయ్యారు. తన తాజా చిత్రం 'వన్ డే : జస్టిస్ డెలివర్డ్' రిలీజ్ సందర్భంగాసెలబ్రేషన్ మూడ్లో ఉన్న ఆమె ఊహించని అనుభవం ఎదుర్కొన్నారు. తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ ఓ హోటల్ నిర్వాహకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు.  


అతడి ఫోటో కూడా షేర్ చేస్తూ ఇతడు కళ్లతోనే మహిళలను రేప్ చేస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషా గుప్తా ట్వీట్ వైరల్ అయింది. అతడిపై నెటిజన్లు మండి పడుతున్నారు. నా లాంటి మహిళలకు కూడా ఈ దేశంలో భద్రత లేదు, సాధారణ అమ్మాల పరిస్థితి ఎలా ఉంటుంది. నా చుట్టూ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ నేను రేప్‌కు గురైనట్లు ఫీలయ్యాను. రోహిత్ విగ్.. నువ్వు పశుులాగా ప్రర్తించావు.'' అంటూ ఇషా గుప్తా ఫైర్ అయ్యారు. 


నేను చెప్పిన రోహిత్ విగ్ ఇతడే. కళ్లతోనే రేప్ చేస్తాడు. అతడు నన్ను టచ్ చేయలేదు, ఏమీ అనలేదు. కానీ అతడి చూపుల్లోనే తప్పుడు ఉద్దేశ్యం కనిపించింది. నా అభిమానిగానో, లేక నేను నటిని అవ్వడం వల్లో కాదు.... నేను మహిళను కావడం వల్లే ఇలా నాపై నీచంగా చూశాడు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? మహిళగా పుట్టడమే పాపమా?.... అంటూ ఇషా గుప్తా ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: