టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస విజయాలు అందుకున్నాడు డైరెక్టర్ తేజ. ముఖ్యం గా కెరీర్ ప్రారంభించిన సమయంలో చిత్రం జయం లాంటి సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ చూపు మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు.


అయితే కొన్నాళ్లకు చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన సమయంలో లాంగ్ గ్యాప్ తీసుకుని రా నాతో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాని తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ తేజ ఇటీవల కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సీత సినిమా తెరకెక్కించి విజయాన్ని అందుకోలేక పోయారు.


ఇటువంటి నేపథ్యంలో కెరియర్లో ఎప్పుడూ చేయని ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు తేజ. తాజాగా ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ మొదలు పెట్టబోయే సినిమాపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తేజ తన నెక్స్ట్ మూవీ ఏ జోనర్ లో ఉండబోతోందో వివరించారు. ప్రస్తుతం తాను ఓ మల్టీస్టారర్ చిత్రానికి కథ సిద్ధం చేసుకుంటున్నట్లు తేజ తెలిపారు. కథ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా సాగేలా స్క్రిప్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తేజ తెలిపారు. 

 

 



మరింత సమాచారం తెలుసుకోండి: