జబర్దస్త్ అనసూయ ఓ పక్క బుల్లితెర మీద అందాల ప్రదర్శనతో ఆడియెన్స్ ను అలరిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తుంది. క్షణం సినిమా నుండి వెండితెర మీద తన సత్తా చాటుతున్న అనసూయ రంగస్థలం రంగమ్మత్త పాత్రలో సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్ లో కథనం సినిమా సెట్స్ మీద ఉంది.


ఇటీవల వాషింగ్ టన్ లోని తానా సభల్లో పాల్గొన్న అనసూయ తను త్వరలో నిర్మాతగా మారబోతున్నట్టు ప్రకటించింది. యాంకర్ గా మాత్రమే చేసిన అనసూయ సినిమాలు కూడా పెద్ద మొత్తంలో చేసింది లేదు అలాంటి అనసూయకు నిర్మాతగా మారేంత డబ్బులు ఉన్నాయా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.


నిర్మాతగా మారి అనసూయ చిన్న బడ్జెట్ సినిమాలు తీసే కొత్త వారిని ప్రోత్సహించాలని అనుకుంటుందట. కచ్చితంగా అనసూయ నిర్ణయం మంచిదే.. ప్రస్తుతం యాంకర్ గా బుల్లితెర మీద హంగామా చేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన స్టామినా చూపిస్తుంది. ఈమధ్య అనసూయ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పిందని టాక్. మరి అమ్మడు నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.


అనసూయ నిర్మాతగా అంటే ఆమె చేసే ప్రమోషన్స్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. రిలీజ్ కు రెడీ గా ఉన్న అనసూయ కథనం మూవీ ఆఫ్టర్ రిలీజ్ తన ప్రొడక్షన్ కు సంబందించిన పూర్తి డీటైల్స్ బయటకు వెళ్లడవుతాయని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: