సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు. జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మ్యాజికల్ బ్లాక్ బస్టర్‌గా అటు ప్రేక్షకుల, ఇటు సినీ వర్గ ప్రముఖుల ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది.

 

కొరియన్ మూవీ అయిన "మిస్ గ్రానీ" సినిమాకి రీమేక్ గా తీసిన " ఓ! బేబి" సినిమాకి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమాలో సమంత అద్భుతంగా నటించిందని ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం సమంత ఎంతగా ప్రమోషన్ చేసిందో తెలిసిందే.  సినిమా సక్సెస్ అయిన కారణంగా రామానాయుడు స్టూడియోలో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో రానా దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా ‘ఇంద్ర’ ఫేమ్ నటుడు తేజ మాట్లాడుతూ.. ‘‘సురేష్‌బాబుగారు కొత్త‌వాళ్ల‌కు చాలా స‌పోర్ట్ ఇస్తారు. నాకు కూడా ఆయ‌న చాలా స‌పోర్ట్ చేశారు. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నందినిగారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆఫ‌ర్ నాకు పెద్ద గిఫ్ట్. అన్నాడు. నిర్మాత సునీత మాట్లాడుతూ, ‘మేమందరం ఊహించిన దానికంటే రెట్టింపు రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో సమంత నిర్మాతలను సేవ్ చేస్తూ అక్రాస్ ది వరల్డ్ గొప్ప స్టార్ అవుతుందని ఒక నిర్మాతగా నమ్మకంగా చెప్పగలను.

 

రివ్యూస్ చూసి చైనా నుంచి కాల్స్ వచ్చాయి. చైనాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం, దీన్ని బట్టి అర్థం అవుతుంది సమంత పవర్ ఏంటో’’ అన్నారు.  మాటల్ రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ, ఈ సినిమాకి పని చేయడం తన అదృష్టమని, నందినీ రెడ్డితో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని ,ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ఎంతో కష్టపడ్డారు కనుకే ఇంత గొప్ప విజయం అందింది అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: