టాలీవుడ్ పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన పవన్ కళ్యాణ్, ఇటీవల సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికి తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తరువాత ఇకపై ఎక్కువగా ప్రజలకు చేరువగా ఉండాలని, అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టి, ప్రజలకు మరింత దగ్గర కావాలని అయన భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రెండు రోజుల క్రితం అయన అమెరికా లోని తానా సభలకు ప్రత్యేక అతిథిగా హాజరవడం జరిగింది. 

ఇక పవన్ అమెరికా చేరుకున్న దగ్గరినుండి ఆయనకు ఫ్యాన్స్ నుండి ఒకటే అభ్యర్ధనలు వస్తున్నాయట. మీరు తప్పకుండా మాలాంటి ఎందరో అభిమానుల కోసం ఒక్క సినిమా అయినా చేయాలి అంటూ పలువురు ఫ్యాన్స్ ఆయనను కోరినట్లు చెప్తున్నారు. అంతేకాక తానా సభలకు వచ్చిన కొందరు అతిథులు సైతం ఆయనను కనీసం ఒక్క సినిమా అయినా చేయండి అంటూ అడిగారట. నిజానికి పవన్ సోదరుడు నాగబాబు సైతం ఇప్పటికే పలుమార్లు పవన్ ఇకపై సినిమాల్లోకి రారని, తన రాబోయే జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేసారని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అభిమానుల నుండి విజ్ఞాపనలు వస్తుండడంతో పవన్ కొంత ఇరకాటంలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. నిజానికి తాను గతంలో చేసిన అజ్ఞాతవాసి మంచి హిట్ సాధించి ఉంటె అభిమానులు తనను ఇంత ఒత్తిడి చేసి ఉండేవారు కాదని, 

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఘోర పరాజయాన్ని అందుకోవడంతోనే తన నుండి ఒక్క మంచి హిట్ సినిమా అభిమానులు ఆశిస్తున్నారని, కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్క సినిమాలో నటించాలనే విధంగా అయన ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే పవన్ భవిష్యత్ ప్రణాళికల ప్రకారం అయనకు ఒక్క సినిమా చేసే టైం కూడా లేదని, కాకపోతే అభిమానుల కోరికతో కొంత ఇరకాటంలో పడ్డ పవన్, రాబోయే రోజుల్లో వారికోసం ఒక సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగవలసిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: