ఈ మద్య దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుందని అందరూ అంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు సంబంధిచిన చిన్నాపెద్దా నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.  ఇటీవల ఏపిలో కూడా పలు టీడీపీ సీనియర్ నాయకులు బీజేపీ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే.  తాజాగా ఉత్తరాదిలో ఎంతో క్రేజ్ ఉన్న సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి బీజేపీలో చేరారు.

బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా మనోజ్ తివారీ తరపున సప్నా చౌదరి ప్రచారం చేశారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ లాల్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సప్నా చౌదరి మాట్లాడుతూ..గతంలో తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో  ప్రియాంకాగాంధీతో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది తనను కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఊహించుకున్నారని అన్నారు. 

అయితే ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టి తాను కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించారు. మనోజ్ తివారీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఎన్నో అభిసంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారని..అందుకే ఆయనను ప్రజలు మళ్లీ ఆధరించారని ఆమె అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: