ఒక సినిమా చూస్తే థియేటర్లో కూర్చున్నవారికి తెలియకుండానే కన్నీళ్లు వస్తుంటాయి. అలా గుండెలకు హత్తుకు పోయే సినిమాలు తెలుగు లోఎన్నో వచ్చాయి. అలాంటి సినిమాల గురించి అందులో నటించిన వారి గురించి మాట్లాడే సమయంలో కూడా కొంత మంది ఎమోషన్ అవుతుంటారు.  ఇప్పుడు ఇలాంటి సన్నివేశమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారే స్టార్ హోదా సంపాదించిన విజయ్ దేవరకొండ ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఆడియో ఫంక్షన్‌లు, వివిధ సినిమా ఫంక్షన్లలలో తన ఫ్యాన్స్‌ తో వాట్సాప్..వాట్సాప్ బ్రో అంటూ తెగ ఉత్సాహ పరుస్తుంటారు. 

కానీ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాత్రం హీరో సెన్సిటివ్‌గా మారిపోయారు. కన్నీళ్లు పెట్టుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. శివాత్మిక, ఆనంద్ దేవకొండ హీరో హీరోయిన్లుగా నటించిన ‘దొరసాని’ మూవీ జూలై 12న విడుదల కానుండటంతో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, రాజశేఖర్ లు ముఖ్య అతిధులుగా హాజరుకాగా జీవిత తదితరులు విచ్చేశారు. అయితే సినిమా గురించి మాట్లాడుతూ..తాను ఇటీవల టీజర్ చూశానని..కానీ దాని గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు, లిరికల్ సాంగ్స్ చూశానని వాటి పై కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు షేర్ చేయలేదు.

అయితే సినీ పరిశ్రమలో సొంతగా ఎలా నిలదొక్కుకోవాలో.. తనను తాను ఎలా నిరూపించుకోవాలో తెలుసుకుంటాడని ఈ సినిమాను ఇప్పటి వరకూ పట్టించుకోలేదంటూ అని అన్నారు. కానీ తన తమ్ముడు యూఎస్‌కి వెళ్లి జాబ్ చేస్తూ ఇంటికి డబ్బు పంపించి, తాను సినిమాల్లో ట్రై చేస్తున్నపుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎంతగా హెల్ప్ చేశాడో తనకు తెలుసని..కానీ నీ సినిమాకి నేం ఏం చేయలేకపోయానని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.


మరింత సమాచారం తెలుసుకోండి: