ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో నిన్న దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సమంత, సింగర్ చిన్మయి, అలాగే హాట్ యాంకర్ అనసూయ మరియు గుత్తా జ్వాల వంటివారు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో విషయం చినికి చినికి గాలివాన అవుతున్న క్రమంలో సందీప్ రెడ్డి వంగ స్పందించక తప్పలేదు. తాను అలా అనలేదని తప్పుగా అర్థం చేసుకున్నారని సందీప్ రెడ్డి వంగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నానని.. అంటే దానర్ధం యువకుడు తాగొచ్చి అమ్మాయిని కొట్టడం కాదని అన్నారు. తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని.. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడానని.. కానీ దురదృష్టవశాత్తు తన వ్యాఖ్యలను తప్పుగా  అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇటీవల బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' గా తెరకెక్కించారు. దీంతో సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ... 'ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు ముట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని' అన్నారు. అంతే వెంటనే చాలా మంది మహిళల ప్రముఖులు ఇంకా సోషల్ మీడియాలో నెటిజన్లు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ సందీప్ రెడ్డి వంగా పై తిట్ల వర్షం కురిపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: