అతి త్వరలో తెలుగులో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షోను గత రెండు సీజన్ల కంటే ఈ సీజన్ మరింత సక్సెస్ అయ్యే విధంగా బిగ్ బాస్ యూనిట్ మరిన్ని హంగులు సిద్ధం చేసిందట. ఇకపోతే ఈ షోలో పార్టిసిపెంట్స్ గా కొందరి పేర్లు ఇప్పటికే పలు మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇక నేడు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో ఒక ఫేమస్ షో కి పనిచేసే యాంకర్ హఠాత్తుగా ఆ షో నుండి తప్పుకోవడంతో, 

ఆమె బిగ్ బాస్ లో తనకు అవకాశం రావడం వల్లనే ఆ షో నుండి తప్పుకుందని వార్తలు పుకారవుతున్నాయి. ఆమె మరెవరో కాదు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో తీన్ మార్ వార్తలు అనే ఫేమస్ షో కి యాంకర్ గా పనిచేసే సావిత్రి అలియాస్ శివజ్యోతి. వాస్తవానికి ఈ షోకు ఉన్న ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. బిత్తిరి సత్తి మరియు సావిత్రి సంయుక్తంగా పాల్గొనే ఈ షోకు ఎప్పటినుండో మంచి ప్రేక్షకాధరణతో పాటు రేటింగ్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇటీవల అర్ధాంతరంగా సావిత్రి ఆ షో నుండి తప్పుకోవడంతో ఆమెకు బిగ్ బాస్ టీమ్ నుండి ఆహ్వానం అందిందని, అందుకోసమే ఆమె ఈ షో నుండి సడన్ గా వెళ్లిపోవాల్సివచ్చిందని వార్తలు వస్తున్నాయి. 

అయితే ఆమె ఇదే విషయాన్ని ఛానల్ యాజమాన్యం వారికి రహస్యంగా చెప్పడం జరిగిందని అంటున్నారు. అంతేకాక ఈ విషయమే ఆమె తన సన్నిహితులకు కూడా చెప్పడంతో వారిలో కొందరు ఈ విషయం మీడియాకు లీక్ చేసినట్లు సమాచారం. ఇక దీన్నిబట్టి, మొన్నేమో పటాస్ షో నుండి శ్రీముఖి, ఇప్పుడేమో తీన్ మార్ వార్తలు షో నుండి సావిత్రి తప్పుకోవడం చూస్తుంటే వారిద్దరూ బిగ్ బాస్ కోసమే ఆయా షోలను సడన్ గా వదిలేసుకున్నారు అనే వార్తలకు బలం చేకూరుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: