క్రేజీ హీరో విజయ్దేవరకొండ తమ్ముడు, ఒకప్పటి హీరో హీరోయిన్లు జీవితరాజశేఖర్ కుమార్తె జంటగా నటిస్తున్న చిత్రం దొరసాని. వీరిద్దరి జంట ఎలా ఉంది అనేది తెరపైన చూస్తేనే మనకు అర్ధమవుతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. జులై 12న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దొరసాని జూక్ బాక్స్ను రాజశేఖర్ విడుదల చేశారు. బిగ్ టికెట్ని విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా...
దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఇది మెమరబుల్ డే. దానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంతో మంది వెనక ఉండి ఇంత దూరం తీసుకొచ్చారు. ఎక్కడో చిన్నగా మొదలైన ఈ జర్నీ ఇంత దూరం రావడం నా జీవితంలో మర్చిపోలేని ఈవెంట్. ఈసినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాలని ఉంది. కానీ కొన్ని విషయాలు.. దొరసాని కథ నేను దాచుకోలేని ఒక ఎమోషనే. ఏ దర్శకుడికైనా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అది తన జర్నీలో కొన్ని సినిమాలు చేసినప్పుడు అందులో ఓ సినిమా అయి ఉంటుంది. కానీ నాకు లక్కీగా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ చిత్రమే. అది దొరసాని చిత్రమే. ఎందుకు ఈ సినిమాను డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నానంటే, ఇలాంటి కథలు తరచుగా రాయరు. కానీ నా చిన్నప్పటి నుంచి విన్న కథలన్నీ ఎక్కడో మెదడు పొరల్లో ఉండి, నా చేత రాయించబడ్డది. ఇందులో హానెస్టీ, రియాలిటీ, పీరియాడిక్, ప్రాపర్ డైలక్ట్, ఫ్రెష్ ఫేసెస్ ఉంటాయి. ఇవన్నీ అచీవ్ చేయడానికి మేం ప్రాపర్ టెక్నాలజీని వాడాం. అనామోఫిక్ లెన్స, సింక్ సౌండ్, ప్రాపెర్ కెమెరా వంటివన్నీ మాకు సాయపడ్డాయి. ఈ కథ చెప్పడానికి ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు అక్కర్లేదు. దానికోసం వెతుకుతున్న ప్రాసెస్లో శివాత్మిక రాజశేఖర్, ఆనంద్దేవరకొండ ఈ సినిమా కోసమే వచ్చారు. వీరిద్దరూ వారి జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా, రాజు, దొరసానిలాగానే గుర్తుంటారు. దర్శకుడిగా నేను చెబుతున్న మాట ఇది. టెక్నికల్ విషయంలో ప్రశాంత విహారి చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మధుర శ్రీధర్గారు ప్రశాంతగారిని పట్టుకుని ఇంత మంచి మ్యూజిక్ రావడానికి సాయపడ్డారు. సినిమాటోగ్రాఫర్ సన్నీ కొరపాటి ఎక్కడో యూరప్లో కొన్ని ప్రాజెక్టులు చేసి ఫ్రెష్గా వచ్చారు. తను ఏ మాత్రం పొల్యూట్ కాకుండా 80ల్లోకి తీసుకెళ్లాడు. నవీన నూలి చాలా సాయం చేశారు. ఆయన అనుభవం నాకు ఉపయోగపడింది. 2.20గంటల సినిమా చాలా బావుంటుంది. వేరే పీరియడ్కి తీసుకెళ్లి అందులోనే ఉంచుతుంది. దొరసాని సినిమా అందరినీ చాలా కాలం వెంటాడుతుంది. ఇదేదో ఓవర్ కాన్ఫిడెన్స కాదు. కాన్ఫిడెన్సే. ఈ సినిమా మేకింగ్ ప్రాసస్లో రియల్ లొకేషన్లలో తీశాం. ఈ లొకేషన్లను ఇంతకన్నా ముందు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. దాదాపు ఏడాదిన్నర పాటు సెర్చ్ చేసి, వేల సంఖ్యలో ఆడిషన్స చేసి 67 మందిని ఈ సినిమా కోసం తీసుకున్నాం. వాళ్లకు కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పటికీ వాళ్లు ఆ పాత్రల నుంచి బయటికి రావడం లేదు. ఇన్ని మంచి విషయాలున్నాయి సినిమాలో. నా కథ, ఇంత పెద్దగా మారుతుందని నేను అనుకోలేదు. ఇది నా పేరెంట్స్ చేసుకున్న పుణ్యమే అని అనుకుంటున్నాను’’ అని చెప్పారు.
నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ - ``చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ కథ వినలేదు. మహేంద్ర పంపిన స్క్రిప్ట్ చదివాను. రెండు రోజులు నిద్ర పోనేలేదు. తను అంత డీటెయిల్డ్గా స్క్రిప్ట్ రాశాడు. మధ్యలో రాజు, దొరసాని మధ్య సన్నివేశాలను యాడ్ చేద్దామని అనుకున్నాం. కానీ మహేంద్ర అందుకు ఒప్పుకోలేదు. తన సినిమాపై అంత క్లారిటీతో ఉన్నాడు. శివాత్మిక జీవితగారికి రీప్లేస్ అవుతుంది. బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. హీరో ఆనంద్ గురించి చెప్పాలంటే.. తనని చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. విజయ్, ఆనంద్ ఇద్దరిలోనూ ప్యూరిటీ ఉంటుంది. ఇద్దరినీ ముందుగానే పోల్చకండి. సినిమా చూసిన తర్వాతే మాట్లాడండి. పెళ్ళిచూపులు ఆడియో కూడా ఇక్కడే జరిగింది. వెంకట్ సిద్ధారెడ్డికి థాంక్స్. అలాగే మధుర శ్రీధర్గారిత పెళ్ళిచూపులు నుండి పరిచయం. ఆ నమ్మకంతోనే ఆయన చెప్పగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అలాగే ధీరజ్ మొగలినేనికూడా థాంక్స్. ప్రశాంత్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మా బావగారు లేకుంటే నేను ఇక్కడకు రాకుండా పో్యేవాడిని. ఆయనకు ఈ సందర్భంగా థాంక్స్`` అన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ - ``నేను 15-22 ఏళ్ల సమయంలో నేను కలలు కనడానికి కూడా భయపడ్డాను. నేను బాగా చదువుకుని యు.ఎస్ వెళ్లిపోయి జాబ్ చేసుకుంటూ ఉండిపోయాను. మరో వైపు అన్న విజయ్, ఒక డ్రీమర్. ఆయన జర్నీలో చాలా స్ట్రగుల్స్ చూశాడు. అవన్ని దాటేసి ఓ సక్సెస్ఫుల్ యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తనతో పాటు డైరెక్టర్స్ తరుణ్ భాస్కర్, సందీప్, రాహుల్, భరత్ కమ్మ తెలుగు సినిమా బౌండరీస్ను పెంచుతున్నారు. రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ లిస్టులో మరో డైరెక్టర్ కె.వి.ఆర్.మహేంద్రగారి పేరు వినొచ్చు. అందుకు ముందు సినిమా కథలు వింటే భయపడేవాడిని. కానీ మహేంద్రగారు కథ చెప్పిన తర్వాత నటుడిగా రాణించవచ్చుననిపించింది. మేం జీవితంలో డబ్బులు గురించి చాలా సమస్యలను ఫేస్ చేశాం. కానీ గత రెండు, మూడేళ్లలో ఆ సమస్యలు పోయాయి. విజయ్ కష్టం వల్లే అది సాధ్యమైంది. తనతో మాట్లాడే సమయంలో తను బిజినెస్ గురించి మాట్లాడేవాడు. సరే! నేను ఇండియా వచ్చేసి తనకు సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. జాబ్ వదిలేసి ఇక్కడకు వచ్చిన తర్వాత మహేంద్రను కలుసుకున్నాను. నా టీమ్తో చేసిన జర్నీ చ
ాలా గొప్పది. సినిమాను అంత రియలిస్టిక్ చేశాం. నా వెనుక దేవరకొండ అనే పేరుందని నేను సినిమాలు చేయడం లేదు. మహేంద్ర మంచి స్టోరీ టెల్లర్. అందులో నేను ఒక భాగమైయ్యానని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. మా దొరసాని శివాత్మిక నటనతో చింపేసింది. మధురశ్రీధర్గారికి, యష్ మామకి థాంక్స్. విజయ్ దేవరకొండ తమ్ముడిలా ఇప్పుడు అందరికీ తెలుసు. రేపు సినిమా చూసిన తర్వాత రాజు అనే పాత్రలో నన్ను యాక్సెప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను`` అన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ - `` సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. అందరినీ ఆశీర్వదించండి`` అన్నారు.
శివాని మాట్లాడుతూ - ``శివాత్మిక కెరీర్లో ఇది మరచిపోలేని రోజు. మహేంద్రగారు గొప్ప దర్శకుడు. రేపు సినిమా రిలీజ్ తర్వాత ఆ విషయం ఒప్పుకుంటారు. సురేశ్ బాబుగారు, మధుర శ్రీధర్గారు, యష్ రంగినేనిగారికి థాంక్స్. చాలా లిమిటెడ్ రీసోర్సస్లో ఈ సినిమాను చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్గారు ఆత్మలా వినసొంపైనా పాటలను అందించారు. ఆనంద్ చాలా మంచి మిత్రుడు. చాలా హానెస్ట్. చాలా నెమ్మదిగా ఉంటాడు. రేపు సినిమాలో తన నటనతో మమ్మల్ని సర్ప్రైజ్ చేశాడు. శివాత్మిక నాకంటే నాలుగేళ్లు చిన్నది. తను చాలా ఇన్నోసెంట్.. తను అక్కలా చూసుకుంటుంది. నా బుజ్జి చెల్లెని 25 రోజుల పాటు ఒంటరిగా కోదాడలో ఈ సినిమా కోసం వదిలేశాం. ఈమెను చాలా మంది ట్రోలింగ్ చేశారు. వారందరినీ తన నటనతో నోరు మూయించేస్తుంది`` అన్నారు.
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ - ``నాకు ఉహ తెలిసినప్పటి నుంది యాక్టర్ కావాలనేదే కోరిక. ఆ కోరిక తీర్చింది నలుగురు వ్యక్తులు. డైరెక్టర్ మహేంద్రగారు నన్ను దొరసాని పాత్రలో ఎంపిక చేసుకున్నందుకు, తనకు థాంక్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ సన్నిగారికి థాంక్స్. ప్రశాంత్ విహారిగారు సోల్ఫుల్ మ్యూజిక్ను అందించారు. మా దొరగారు వినయ్గారితో నటించడం ఆనందంగాఉంది. మా డైరెకక్షన్ టీమ్, ఇతర టీమ్ ఎంతో కష్టపడ్డారు. ధీరజ్ నిజంగా దొరసానిలా చూసుకున్నారు. నాకు 19 ఏళ్లు. నేను స్కూల్ మానేసి సినిమాల్లో నటిస్తానని అనగానే ఏమాత్రం ఆలోచించకుండా నీ కలను నేరవేర్చుకో అని ఫ్రీడమ్ ఇచ్చారు. మా అమ్మమ్మ, నానమ్మ లేరిక్కడ. అలాగే మా మురళి మావయ్య నాకు ఎంతగానో సపోర్ట్ అందించారు. ఎవరూ నా గురించిఅడిగినా తన నటి అవుతుందని చెప్పేవారు. ఆనంద్తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రాజు పాత్రను మరెవరూ చేయలేరు. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన వారందరికీ థాంక్స్. మేం హానెస్ట్ లవ్స్టోరి చేశాం. జూలై 12న సినిమాను చూసి ఆదరించండి. ఫ్యూచర్లో నన్ను, మా శివానిని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను`` అన్నారు.