మాలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ఆడై'.  ఈ మూవీని తెలుగు లో ‘ఆమె’గా డబ్ చేస్తున్నారు.  ఆ మద్య ఈ మూవీకి సంబంధించిన టీజర్ పెను సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. టీజర్ చివర్లో అమలాపాట్ పూర్తి నగ్నంగా కనిపించింది.  ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఈ రేంజ్ లో నగ్నంగా నటించడం ఒకంత ఆశ్చర్యమే అనిపించినా ఆ పాత్ర అలాంటిదట. అయితే అమలాపాల్ చేసిన ధైర్యానికి సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వచ్చాయి..మరోవైపు ఇంత అశ్లీలంగా నటించడానికి సిగ్గుండాలని విమర్శలు కూడా వచ్చాయి.

తాజాగా 'ఆడై'లో అమలాపాల్ నగ్న సన్నివేశంలో అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..దర్శకుడు రత్నకుమార్ ఈ సీన్ చెప్పినపుడే దానికి గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని..ఆ సమయంలో తను ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించానని అన్నారు. ఈ సందర్భంగా దర్శకులు రత్న కుమార్ తనకు ఎంతో ధైర్యం చెప్పారని..ఈ మూవీకి ఈ సన్నివేశం ప్రాణం పోస్తుందని అన్నారు. అంతే కాదు కంగారు పడాల్సిన పని లేదని పాత్రలో లీనమైపోవాలని అన్నారు. 

ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే రోజున తాను చాలా టెన్షన్ కు గురయ్యానని సెట్స్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠకు గురయ్యానని... సెట్స్ లో ఎవరెవరు ఉంటారు? తనకు రక్షణ ఉంటుందా? కంగారు పడ్డానని చెప్పింది. ఆ సమయంలో  కేవలం 15 మంది మాత్రమే సెట్స్ లో ఉన్నారని అమలాపాల్ తెలిపింది. క్రూ సభ్యలపై నమ్మకం లేకపోతే తాను ఆ సన్నివేశాన్ని చేయలేకపోయేదాన్నని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: