పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీన రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎవరు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. దిల్ రాజు సినిమా తీసుకోవడానికి అంగీకరించలేదు. కారణం గతంలో మెహబూబా సినిమా తీసుకొని చేతులు కాల్చుకున్నాడు.
అందుకే పూరి సినిమాలంటే భయపడుతున్నాడు. ఒకవేళ ఎవరు తీసుకోకపోతే సొంతంగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు జగన్. పైగా సినిమా పై జగన్ కు పూర్తి నమ్మకం ఉందట. తన పాత సినిమాలను గుర్తుకు తెస్తానని.. తప్పకుండా ఇస్మార్ట్ హిట్ కొడతాడని అంటున్నాడు.
పూరి సినిమాలు ఒకప్పుడు నిజంగా భలే ఉండేవి. ఎలాంటి సినిమా తీసినా ప్రేక్షకులు హిట్ చేసేవారు. ప్రతి సినిమాను కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఇష్టపడేవారు. కొంతకాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఎంత కొత్తగా ప్రెజెంట్ చేయాలనీ చూసినా కలిసి రావడం లేదు.
పక్కా లోకల్ లాంగ్వేజ్ తో, డబుల్ దిమాక్ పేరుతో సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ రావడం, సాంగ్ విషయంలో కూడా అదే విధమైన రెస్పాన్స్ రావడంతో సినిమా ఉంటుందో అని అంతా ఎదురు చూస్తున్నారు. రామ్ ఎనేర్జిటిక్ గా కనిపిస్తున్న మాట వాస్తవమే. మరి సినిమా ఎలా ఉంటుందో.