కింగ్ నాగార్జున కథానాయకుడిగా రకుల్ ప్రీత్ కథానాయకగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'చిత్రం మన్మథుడు 2'. మన్మథుడు సీక్వల్ గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ లో నీకు షటర్లు మూసేసి దుకాణం సద్దేసే చేసే టైమ్ వచ్చేసింది అంటూ ట్రైలర్ మొదలై, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులో జరగాలి అంటూ నాగార్జునని ఏడిపించడం చూసాం. 60 ఏళ్ళ వయసులో కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలో రొమాన్స్ ఓ రేంజ్ లో పండిపోయింది.
అయితే ఆ ట్రైలర్ లో కేవలం నాగార్జునని చూపించి, కథానాయకాలని చూపించకుండా కుట్ర చేసిన టీజర్ ను ఇప్పుడు విడుదల చేసారు. మీట్ అవంతిక అంటూ విడుదలైన ఈ సినిమాలో రకుల్ ఓ రేంజ్ లో నటించింది. కుటుంబసభ్యుల ముందు పద్దతిగా నటిస్తూ నాగార్జునకి చుక్కలు చూపిస్తుంది అనుకోండి. రకుల్ నాగార్జునతో మాట్లాడుతూ ఇప్పటిదాకా 'యు' సర్టిఫికెట్ కోసం ప్రయత్నించాను. ఇప్పుడు 'ఏ' సర్టిఫికెట్ చూపిస్తా అని రకుల్ తన పాత్రా స్వభావాన్ని ఆ ఒక్క డైలాగ్ తో బయటపెట్టేసింది.
నాగార్జున, రకుల్ టీజర్ ను చుసిన ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. కాగా ఈ సినిమాలో తల్లి పాత్రల్లో ఓ బేబీలో నటించిన సీనియర్ నటి లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ తో పాటు మరో కథానాయికగా కీర్తి సురేశ్ కూడా నటించారు. కాగా వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అతిథి పాత్రలో అక్కినేని సమంత నటించగా, కీలక పాఠాల్లో వెన్నెల కిశోర్, రావూ రమేష్, ఝాన్సీ, దేవదర్శిని నటిస్తున్నారు.