టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఇటీవల కొద్దిరోజులుగా వరుస సక్సెస్ లు సాధిస్తూ నటిగా మరింత వేగంగా ముందుకు దూసుకెళ్తున్న భామ అక్కినేని సమంత. తోలి సినిమా ఏం మాయ చేసావే సినిమాతోనే అతి పెద్ద సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ చుల్ బులి, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని ఆపై టాలీవుడ్, కోలీవుడ్ లలో దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. 

ఇక ఇటీవల నాగచైతన్యను తన జీవిత భాగస్వామిగా చేసుకున్న సమంత, పెళ్లి తరువాత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తోంది, అయినప్పటికీ ఆమెను సక్సెస్ లు వరిస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఆమె నటించిన ఓబేబీ సినిమా సూపర్ హిట్ టాక్ తో అన్ని ఏరియాల్లోను మంచి కలెక్షన్లు రాబడుతూ దూసుకెళుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు చాలారోజుల తరువాత లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఇటీవల కొరియన్ భాషలో రూపొంది మంచి సక్సెస్ సాధించిన మిస్ గ్రానీ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, తేజ సజ్జ, ప్రగతి, తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు ఇంత అద్భుతంగా కలెక్షన్లు రావడానికి కారణాం ముఖ్యంగా సమంతనే అంటోంది ఆ సినిమా యూనిట్, సమంతకు యూత్ మరియు లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడమే దానికి కారణం అని, అదీకాక ఈ సినిమాలో సమంత పోషించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, ఆమె కెరీర్ లో ఇప్పటివరకు పోషించకపోవడంతో ఆమె నటనను మెచ్చిన అభిమానులు విపరీతంగా థియేటర్లకు వస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ ఓబేబీ సినిమా ఇప్పటికే 3 రోజుల్లో రూ.17 కోట్లవరకు గ్రాస్ కలెక్షన్లు సంపాదించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: