ఇటీవల రెండుళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ అటు ప్రేక్షకాభినంతో పాటు, ఇటు మంచి రేటింగ్స్ కూడా సంపాదించిన షో బిగ్ బాస్. స్టార్ మా ఛానల్ వారు ఇప్పటివరకు నిర్వహించిన ఈ షో రెండు సీజన్లు మంచి సక్సెస్ సాధించడంతో అతి త్వరలో దీని మూడవ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సీజన్ కు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో షోపై అంచనాలు అమాంతం పెరిగాయి. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ విషయమై కొనసాగుతున్న ప్రచారం పై ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. 

ఇక నిన్నటినుండి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ విషయమై ఒకవార్త మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే, ఈ షోలో ఇప్పటికే యాంకర్లు శ్రీముఖి, లాస్యాలు పాల్గొంటున్నట్లు వార్తలు వస్తుండగా, వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో ఒకరైన హెబ్బా పటేల్ కూడా ఈ షో ద్వారా రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఇక కొద్దిరోజుల నుండి హెబ్బా ఇంటినుండి బయటకు రావడం లేదని, అంతేకాక తనకు ప్రస్తుతం వస్తున్న అవకాశాలను కొన్నాళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ఆయా సినిమాల నిర్మాతలకు ఆమె చెప్పడం జరిగిందని అంటున్నారు. 

దానికి కారణం ఇటీవల బిగ్ బాస్ షో కోసం ఆ షో టీమ్ వారు హెబ్బాను తమ సీజన్ 3 లో పాల్గొనమని కోరారని, అందుకుని ఆమె సమ్మతించిందని, అందుకోసమే  తన సినిమా అవకాశాలను వాయిదావేసుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులోనూ హెబ్బా ఈ షో లో పాల్గొంటే శ్రీముఖి వంటి యాంకర్ కు ఒకింత గట్టి పోటీ కూడా ఇచ్చినట్లవుతుందని, తద్వారా షోకు మరింత క్రేజ్ వస్తుందని భావించి, బిగ్ బాస్ వారు హెబ్బాను తీసుకోవాలని నిర్ణయించారట. మరి ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగాల్సిందే.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: