ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేస్తున్నారు మెగా ఫ్యామిలీ.  ఇప్పటికే అరడజను మంది హీరోలకు పైగా వచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవుతున్నారు. మొదటి సారిగా మెగాబ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  నిహారిక  హీరోయిన్ కాక ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో హీరోయిన్ గా నటించింది. పలు షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్టర్ గా కూడా వ్యవహరించింది. తర్వాత  ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారారు. 

ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా..నిహారికకు మంచి పేరు వచ్చింది. తర్వాత  హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి మూవీస్ నటించింది. ఈ సినిమాలు కూడా నిరాశపరచడంతో నిహారిక ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దాంతో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఆమె సినిమాలకు హీరోయిన్ గా గుడ్ బాయ్ చెప్పి తండ్రి బాటలో నిర్మాతగా మారాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో వెబ్ సిరీస్ లు కూడా చేసింది. అదే బ్యానర్ ని కొనసాగించి మెగా హీరోలతో సినిమాలు చేయాలని నిహారిక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నిహారిక పెళ్లి గురించి కూడా తరచుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: