ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో ఎంతో ఘనంగా తానా సభలు, తెలుగు ప్రజలు మరియు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఎంతో వేడుకగా జరిగాయి. ఇక ఈ వేడుకకు టాలీవుడ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మరికొందరు నటులు విచ్చేసి సభలను ఎంతో విజయవంతం చేసారు. అయితే ఈ సభల సమయంలో మన టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ కామెడీయన్ కు సన్మానం జరిగిందని, ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలకు గాను తానా వారు ఆయనను ఘనంగా సన్మానించారు. 

అయితే తానా సభలు ముగిసిన అనంతరం అక్కడి మరొక ప్రముఖ తెలుగు సంస్థ, ఆ కమెడియన్ కు సన్మానం చేయాలని నిర్ణయించి, ఆయనను గౌరవంగా పిలిచి గొప్పగా సన్మానించడం జరిగిందట. అయితే సన్మానం అనంతరం ఆ సంస్థ వారు ఏర్పాటు చేసిన పెద్ద పార్టీలో సదరు కమెడియన్ కు దేహశుద్ది జరిగినట్లు నేటి ఉందయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దానికి ఒక కారణం ఉందని సమాచారం అందుతోంది. ఆ సదరు కమెడియన్ పార్టీ జరుగుతున్న సమయంలో మద్యం సేవించన మత్తులో అక్కడివారిపై దౌర్జన్యం చేయడం జరిగిందని, అంతేకాక ఆ మత్తులో ఒక మహిళ తో అసభ్యంగా ప్రవర్తించాడని, అది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు సదరు కమెడియన్ కు బాగా దేహశుద్ది చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ విషయం బయకు పొక్కితే ఆ కమెడియన్ పరువుతో పాటు తమ సంస్థ పరువు కూడా పోతుందని భావించి విషయాన్ని బయటకు రానీయలేదట సదరు సంస్థ. ఇక ఈ గొడవ అనంతరం ఆ కమెడియన్ ఇండియాకు తిరుగుపయనమయ్యాడట. మరి అయన ఎవరు అనే దానిపై మాత్రం సమాచారం లేదు. ఇక ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ప్రస్తుతం ఈ వార్త తెగ ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్తలో పూర్తి వాస్తవాలు తెలియాల్సి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: