మాస్ అండ్ కమర్షియల్ డైరక్టర్ బోయపాటి శ్రీనివాస్ కు ప్రస్తుతం టైం బ్యాడ్ నడుస్తుందని చెప్పొచ్చు. రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమా బోయపాటి ఇమేజ్ డ్యామేజ్ చేసింది. రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న చరణ్ కు వి.వి.ఆర్ సినిమా ఘోర పరాజయం అందించింది.


ఈ సినిమా తర్వాత రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణతో సినిమా చేస్తాడని అన్నారు. కాని ఆ సినిమాకు నిర్మాత సెట్ అవట్లేదట. ముందు బాలకృష్ణ ఈ సినిమా నిర్మించాలని భావించినా ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ కు బాలకృష్ణ వెనక్కి తగ్గాడు.


బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు హిట్ అవడంతో ఈ హ్యాట్రిక్ కాంబీనేషన్ మీద అంచనాలు పెరిగాయి. అందుకే దిల్ రాజు ఈ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాడు. కాని బోయపాటి ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు చెప్పడంతో వెనక్కితగ్గాడట. 70 కోట్లతో బాలయ్య సినిమా అంటే ధైర్యం చేయలేకపోయాడు.


బోయపాటి శ్రీనివాస్ ఇప్పటివరకు కేవలం మాస్ అండ్ కమర్షియల్ అంశాలే హ్యాండిల్ చేశాడు. కొత్త జానర్ ఆయనకు తెలియదు అందుకే దిల్ రాజు అంత బడ్జెట్ బోయపాటి మీద పెట్టేందుకు సుముఖత చూపించలేదు. ఫలితంగా బోయపాటి బాలయ్య సినిమా హోల్డ్ లో ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: