బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగులోకి తీసుకువచ్చారు. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సీజన్ 2ని నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక త్వరలో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంపికయ్యారు. ఆల్రెడీ ఎం.ఈ.కే రియాలిటీ షోతో సూపర్ సక్సెస్ కొట్టిన నాగార్జున మరోసారి బుల్లితెర మీద సందడి చేయనున్నారు.


ఇప్పటికే కంటెస్టంట్స్ అందరు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఈసారి కంటెస్టంట్స్ లిస్ట్ లో స్టార్ సెలబ్రిటీస్ ఉన్నట్టు సమాచారం. ఇదిలాఉంటే బిగ్ బాస్ కంటెస్టంట్ గా వెళ్లాలంటే బాస్ కు ఏమిస్తారని అడిగినట్టు యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు సినిమా హీరోయిన్స్ విషయంలోనే కాస్టింగ్ కౌచ్ వార్తలు వచ్చాయి. 


అలాంటిది ఓ టివి షో కోసం అలా చేస్తారా అంటున్నారు. శ్వేతా రెడ్డి మాత్రం ఫిబ్రవరి నుండి తనతో సంప్రదింపులు జరిపారని మొత్తం ఓకే అవగా ఫైనల్ గా బాస్ కు మీరేమిస్తారు అన్న మాటతో తను గట్టిగా మాట్లాడేసరికి వాళ్లు వెనక్కి తగ్గారని. తనని బిగ్ బాస్ కంటెస్టంట్ గా కూడా సెలెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది శ్వేతా రెడ్డి. 


అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. బిగ్ బాస్ ముసుగులో అసలేం జరుగుతుందని ఆరా తీస్తున్నారు. నిజంగానే అలాంటిది ఏదైమా ఉంటే ఇంతకుముందు ఇలాంటి వాటి గురించి ఎవరు మాట కూడా మాట్లాడలేదు కదా అని అంటున్నారు. బిగ్ బాస్ షోపై శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: