స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మహర్షి మూవీ తో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న పూజ హెగ్డే ఈ సినిమాలో బన్నీ సరసన జతకడుతోంది. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఇక ఇదివరకు బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో, 

ప్రస్తుతం హ్యాట్రిక్ మూవీ గా రాబోతున్న దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదీకాక బన్నీ నటించిన గత రెండు సినిమాలు ఆయన ఫ్యాన్స్ ను పెద్దగా సంతృప్తి పరచకపోవడంతో, ఈసారి తప్పకుండా వాళ్లకు మంచి హిట్ ఇవ్వాలని బన్నీ కూడా ఎంతో కసితో ఈ సినిమా చేస్తున్నాడట. ఇక త్రివిక్రమ్ కూడా అరవింద సమేత హిట్ తో మంచి జోష్ మీద ఉండడంతో, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సినిమా యూనిట్ ఫిక్స్ అయింది. 

ఈమేరకు కాసేపటి క్రితం తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వార్తను పోస్ట్ చేయడం జరిగింది. అంతకముందు ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ లో కొంత జాప్యం వలన సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త విన్న బన్నీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా, రేపు విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: