మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. పరుచూరి బ్రదర్స్ కథనందించిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ సమయంలో నయన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఫిలిం నగర్లో హల్చల్ చేస్తోంది. 

ఈ సినిమాకోసం నయన్ కు భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళం, తెలుగులో వరుస సినిమాలతో నయన్ బిజీగా ఉండడంతో 'సైరా' కు కాల్ షీట్స్ సర్దుబాటు చేయడం కష్టం అయిందట. అందుకే భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ నయన్ ను ఒప్పించారని సమాచారం. అయితే రెమ్యూనరేషన్ మాత్రమే కాదు.. నయన్ సొంత ఖర్చులు కూడా నిర్మాత చరణ్ భరించాడని దీంతో నయన్ కు ఖర్చు పెట్టిన ఎమౌంట్ గురించి తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు షాక్ అవుతున్నారట.  నయన్ ప్రయాణ ఖర్చులు.. ఫైవ్ స్టార్ హోటల్ వసతి కల్పించడం లాంటివి ఈ ఖర్చులలో భాగం అని సమాచారం.

అయితే ఎవరేమనుకున్న ఈ విషయంలో చరణ్ చాలా క్లారిటీతో ఉన్నాడట.  ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో ఒక మరపురాని చిత్రంగా నిలిచిపోవాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు చరణ్. ఇక నయన్ ప్రెజెన్స్ తమిళంలో ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే నమ్మకంతో చరణ్ ఖర్చుకు వెనకాడలేదట.  ఈ సినిమాలో తమన్నా.. జగపతిబాబు.. సుదీప్.. విజయ్ సేతుపతి.. కీలక పాత్రలలో నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అనుష్క అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2 న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: