టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఏదైనా వార్త వస్తే అది సెన్సేషనే అవుతుంది. ఇండియా మొత్తం ఆయన పేరు మారుమోగిపోతోంది మరి. ఆయన గురించి ఏ న్యూస్ వచ్చినా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతుంది. అలాంటి రాజమౌళికి ఒక అబద్ధం చెప్పాడు. అదేంటంటే..

 

 

ఇటీవల అమెరికాలో తానా మహాసభలు జరిగాయి. పవన్ కల్యాణ్ తో సహా చాలామంది ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. అదే టైమ్ లో రాజమౌళి కూడా అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. దాంతో కొంత బజ్ క్రీయేట్ అయింది. తానా సభలో రాజమౌళి కూడా పాల్గొంటున్నాడని వార్త బయటకు వచ్చింది. దీనిపై రాజమౌళి వెంటనే స్పందించాడు. "నేను అమెరికా పర్సనల్ పని మీద వచ్చాను.. తానా సభల కోసం కాదు" అని క్లారిటీ ఇచ్చాడు. జక్కన్నే స్వయంగా మెసేజ్ ఇచ్చేప్పటికి అందరూ నిజం అనుకున్నారు. కానీ సడన్ గా తానా సభలో అన్న కీరవాణి తో కలిసి ప్రత్యక్షమయ్యాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. రాజమౌళికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చించుకున్నారు. దీనిపై జక్కన్న స్పందిస్తూ.. "అన్నయ్యను విష్ చేయటానికే వచ్చాను తప్ప సభలకు కాదు" అని మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు.

 

 

దీంతో నెటిజన్లు పలు సెటైర్లు వేస్తున్నారు. అభినందిస్తే హోటల్ రూంలో విష్ చేయొచ్చు కదా..అబద్దాలు కూడా చెప్తావా జక్కన్నా అంటూ సెటైర్లు పిలుస్తున్నారు. నిజమే మరి..! ఇంత పాపులారిటీ ఉన్న వ్యక్తులు ఏం చెప్పినా అభిమానులు వింటారు, నమ్ముతారు. అలాంటప్పుడు ఇలా అబద్దాలు చెప్పడం సరైంది కాదు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: