యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత మరోసారి భారీ బడ్జెట్తో `సాహో` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ `సాహో` సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రద్దాకపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ సినిమా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. సాహో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 15న రీలిజ్ కాబోతోంది.
మరో నెల రోజుల్లో రిలీజ్ డేట్ ఉండడంతో, లాస్ట్ మినిట్ హర్రీ లేకుండా చూడాలని `సాహో` పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ చకచక పూర్తి చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ రిలీష్ కాబోతుండడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రింట్లు పంపాల్సి ఉంటుంది. నిర్మాతల్లో ఒకరైన వంశీ, దర్శకుడు సుజిత్ తో కలిసి చెన్నయ్ లోనే వుండి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం చేసుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్ వర్క్ దాదాపు పూర్తి అయిపోయినట్టే అని తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రీజర్లు హోరెత్తిస్తున్న ఈ సినిమా తొలిసగాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. గంట ఇరవై నిమషాలు వచ్చిందని తెలుస్తోంది. వాస్తవానికి ఫస్టాఫ్ రన్ టైం గంటా ఇరవై నిమిషాలు అంటే కాస్త ఎక్కువే. తరువాత మొత్తం సినిమాను చూసుకుని, అప్పుడు ఏది ఉంచాలి? ఏది తగ్గించాలి? అన్నది డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. అందులో ఐదు, పది నిమషాలు తగ్గితే ఇంకా బాగుంటుంది. మరి సాహా మేకర్లు ఏం చేస్తారో చూడాలి. రిలీజ్ డేట్ దగ్గరలో ఉండడంతో పదిరోజులు ముందుగానే అన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.