ఇండియా సెమి ఫైనల్ లో ఓడిపోవటంతో చాలా మంది సినీ జనాలు కూడా స్పందించారు. ఇదే కోవలో పూజా హెగ్డే కూడా స్పందించి, ట్రోలింగ్ కు గురైయింది. చివరిదాకా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ధోని, రవీంద్ర జడేజా పార్ట్‌నర్‌షిప్ ఒక్కటే చెప్పుకోదగినది. టీమ్ ఇండియా జోష్ చూసి ఈ సారి వరల్డ్ కప్ భారత జట్టుదే అని ఫిక్స్ అయ్యారంతా. కానీ ఊహించని రీతిలో ఇండియా టీమ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు క్రీడాభిమానులు. సరిగ్గా ఈ తరుణంలో ధోనీపై కామెంట్ చేసి ఇరుక్కుపోయింది పూజా హెగ్డే. 


ఇండియా ఓడిపోయాక ట్వీట్ చేసిన పూజా.. ''భారత జట్టు పరాజయం పాలవడం తట్టుకోలేక పోతున్నా. బట్ ధోనీ బాగా ఆడాడు. మరోసారి ఈ మ్యాచ్ ద్వారా అతనే నా ఫేవరేట్ ఎందుకయ్యాడనేది ప్రూవ్ చేశాడు. ప్రతీ మ్యాచ్‌లో భారత విజయం కోసం పోరాడతారు ధోనీ. అతనంటే నాకు చాలా ఇష్టం'' అని పేర్కొంది. ఇదే ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.  నిజానికి భారత జట్టు 18 పరుగులతో ఓడిపోవడంతో పరోక్షంగా కారణమయ్యాడు ధోనీ. చివరిదాకా పోరాడిన ఆయన రన్ అవుట్ కాకపోయి ఉంటే భారత జట్టు గెలిచే అవకాశం ఉండేది.


ఇవే అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ వరల్డ్ కప్‌లో ధోనీ సాధించిన ఘనత ఏంటో! ఎందుకంతగా పొడుగుతున్నావ్ పూజా అంటూ ఆమెకు చురకలంటిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమాలో కూడా భాగమవుతోంది పూజా. ఇదిగాక బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ 4 లో కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: