టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినీ నటి ఛార్మీలు ఇప్పటికే వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్ పేరుతో ఇప్పటికే ఓ సంస్థను వీరిద్దరూ కలసి నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా కొత్త హీరో హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు.మరోవైపు, పూరిజగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ పూరిటూరింగ్ టాకీస్ పనులను కూడా ఛార్మీ పర్యవేక్షిస్తుంటుంది.
తాజాగా వీరిద్దరూ కలిసి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. మగవారి బట్టలను ఆన్లైన్లో అమ్మడమే వీరి కొత్త బిజినెస్. మరి ఈ వ్యాపారం కోసం ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించబోతున్నారు. ముందుగా ఆర్డర్ చేసిన వారికి 30శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో ఈ బట్టల డిజైన్లను ఒక వీడియో రూపంలో చూపించారు. న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయి ఈ డ్రస్సులు.