టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న వారు నిర్మాణ రంగంలో కూడా తమ సత్తా చాటిన విషయం తెలిసిందే.  అయితే కొంత మందికి ఈ నిర్మాణ రంగం కలిసి వచ్చినా..కొంత మంది మాత్రం దారుణ నష్టాలకు గురై కనిపించకుండా పోయిన వారు ఉన్నారు.  ఒక సినిమా నిర్మాణం అంటే ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని చిత్ర యూనిట్ ని మెప్పించే విధంగా ఉండాలి. తీరా మూవీ థియేటర్లోకి వచ్చిన తర్వాత హిట్ అవుతుందా..ఫ్లాప్ అవుతుందా అనేది జనాలు చెప్పే తీర్పూను బట్టి ఉంటుంది. 

ఈ మద్య కాలంలో హిట్ అయిన మూవీ పెద్దగా కలెక్షన్లు ఏమీ రాబట్టడం లేదన్న విషయం తెలిసిందే.  ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే పైరసీ భూతం వెంటాడుతుంది.  అయితే కొంత మంది తెగించి సినిమాల్లో నటీ,నటులు నిర్మాణ రంగం వైపు వెళ్తున్నారు.  ఇటీవల బుల్లితెరపై తన సత్తా చాటుతున్న హాట్ యాంకర్ అనసూయ కూడా నిర్మాతగా మారబోతున్నట్లు తన సన్నిహితులతో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు అక్కినేని కపుల్స్ కూడా సొంత ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారట.

ఇటీవల రిలీజైన సమంత ఓ బేబీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను అందుకుంటోంది. దాంతో తమ తదుపరి మూవీ సొంత బ్యానర్ లో తీయాలని ప్లాన్ చేస్తుందట అక్కినేని సమంత..దానికి   నాగ చైతన్య కూడా సమంత నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇక వీరు నిర్మించబోయే కొత్త సినిమాకు నందిని రెడ్డి దర్శకురాలని తెలుస్తోంది. ఓ బేబీ సినిమాతో మెప్పించిన నందిని రెడ్డి ఇటీవల సమంతకు సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన ఒక కాన్సెప్ట్ ను వివరించిందట. ఎలాగైనా కొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్థాపించి సొంతంగా సినిమాను నిర్మించాలని సమంత భర్తతో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: