చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ప్రారంభింపబోతున్న మూవీకి హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని సంప్రదించినప్పుడు ఆమె పెట్టిన కండిషన్స్ చిరంజీవి షాక్ అయినట్లు సమాచారం. ఈమూవీకి సంబంధించి తాను బల్క్ డేట్స్ ఇవ్వలేనని అదేవిధంగా ఈ మూవీ కోసం నిర్మాతలు కోరినన్ని డేట్స్ కూడ ఇవ్వలేనని స్పష్టంగా చెప్పినట్లు టాక్.

అంతేకాదు ఈమూవీ షూటింగ్ ముంబాయ్ లో జరినప్పుడు మాత్రమే తాను నటించగలనని ఈమూవీ షూటింగ్ కోసం తాను ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి నటించలేనని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఈమూవీ నైట్ షూటింగ్ సమయాలు తనకు అనుకూలం కావని కూడ చిరంజీవికి ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇక పారితోషికం విషయంలో ఆమె చేసిన డిమాండ్ చుక్కలను చూపించింది అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఐశ్వర్య ఏకంగా 4 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడమే కాకుండా ఆమె వ్యక్తిగత సిబ్బంది అయిన హెయిర్ డ్రసర్ కు అదేవిధంగా వ్యక్తిగత మేకప్ మ్యాన్ కు కూడ భారీ మొత్తాలను పారితోషికంగా అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఈ డిమాండ్స్ అన్నీ ఐశ్వర్య వ్యక్తిగత సహాయకుల నుండి మెగా కాంపౌండ్ కు అందడంతో ఈ డిమాండ్స్ పట్ల తీవ్ర అసహనం ఆశ్చర్యం వ్యక్త పరిచినట్లు లీకులు వస్తున్నాయి. దీనితో కొరటాల ఐశ్వర్య ఎంపికకు సంబంధించిన ఆలోచనలను పక్కకు పెట్టి మరెవరైనా ఫ్రెస్ ఫేస్ చిరంజీవి పక్కన బాగుంటుందా అన్న అన్వేషణలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నయనతార అనుష్క శృతి హాసన్ లలో ఎవరో ఒకరు చిరంజీవి పక్కన నటించే అవకాసం ఉన్నా కొరటాల శివ ఫ్రెష్ ఫేస్ కావాలి అని కోరుకోవడంతో ఈ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: