కన్నడ నటి రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.  ఈ సినిమా నటించే సమయంలోనే రష్మికకు కన్నడ నటుడు రక్షిత్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది.  ఛలో తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.  ఛలో తరువాత అవకాశాలు రావేమో అనుకుంది.  


అనుకోకుండా, గీత గోవిందం సినిమాతో ఆమె అదృష్టం మారిపోయింది.  ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ స్థాయిలో వసూళ్లు చేస్తుందని రష్మిక కూడా ఊహించలేదు.  ఈ సినిమా తరువాత టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు రావడంతో రష్మిక కెరీర్ పై దృష్టిపెట్టింది.  


ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకుంది.  ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నాక ఆమెను అనేక చోట్ల అనేకమంది ప్రెస్ మీడియా దీని గురించే ప్రశ్నలు అడిగారు.  దీంతో రష్మిక విసిగెత్తిపోయింది.  ఏదో ఒక సమాధానం చెప్పి పక్కకు తప్పుకుంది.  ఇప్పటికి రశ్మికను దీని గురించే ప్రశ్నిస్తున్నారు.  


డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక, విజయ్ దేవరకొండ మీడియాతో చిట్ చాట్ చేశారు.  ఈ సమయంలో మీడియా రశ్మికను తన ఎంగేజ్మెంట్ గురించి అడగడంతో విజయ్ స్పందించాడు.  పర్సనల్ వ్యవహారాల్లో తలదూర్చిడం ఏంటి అని మండిపడ్డాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: