సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ.. అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా ఇటివలే మొదటి షెడ్యూల్ ను జరుపుకుంటోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాలో తన క్యారెక్టర్ గురించి అనిల్ చెప్పింది ఒకటి, ఇప్పుడు సెట్స్ లో చేస్తుంది ఒకటని వార్తలు వస్తున్నాయి. తన క్యారెక్టర్ ను కుదించడం జగపతిబాబుకు నచ్చకే ప్రాజక్టు నుంచి బయటకు వచ్చేశాడని టాక్. దీంతో నిర్మాతలు ప్రకాశ్ రాజ్ ను ఈ క్యారెక్టర్ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. దర్శక, నిర్మాతలు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సివుంది.

 

వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మికా మందన నటిస్తోంది. ఎన్నో ఏళ్ల విరామం తరువాత ఒకనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తూండగా, రత్నవేలు కెమెరావర్క్ చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: