టాలీవుడ్ లో కొన్ని కమెడియన్ జంటలను తెరపై చూడగానే ఒక్కసారే నవ్వు వస్తుంది. పాత తరం నటుల్లో రాజబాబు-రమా ప్రభ, రేలింగి - గిరిజ, చలం-గీతాంజలి తర్వాత బ్రహ్మానందం-కోవై సరళతో పాటు హేమ కాంబినేషన్ కూడా ఎంతో క్రేజీగా ఉండేది. నటి హేమా పేరు సినిమాల్లోనే కాకుండా ఇతర విషయాల్లో కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా వస్తుంటారు. ముఖ్యంగా ఆ మద్య ‘మా’ అసోయేషన్ ఎన్నికల సందర్భంగా హేమ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం ఆమె అత్తగా, అక్కగా, భార్యగా, వదినగా ఇలా పలు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటిస్తున్న విషయం తెలిసిందే. హేమ గతంలో నల్లారి కిరణ్ కుమార్రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ఆ పార్టీకి తన వంతు ప్రచారం చేశారు. ప్రస్తుతం ఏపిలో వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది. ఇటీవల వైసీపీలో చేరిన సినీ నటులకు సీఎం జగన్ మంచి పదవులు కట్టబెతున్న విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హేమా..తాను ఇక సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తి రాజకీయాలలోనే ఉండాలని భావిస్తున్నట్టు మీడియాతో తెలిపింది. రాజమండ్రిలో ఇల్లు కట్టించుకున్నట్టు తెలిపిన ఆమె అది పూర్తి కాగానే, సినిమా పరిశ్రమని వదిలి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఇక బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ..నాగార్జున ఏదైనా క్లీయర్ ఉంటేనే ఓప్పుకుంటారు..కాంట్రవర్సీల జోలికి ఆయన వెళ్లరు. ఒకవేళ బిగ్ బాస్ లో అలాంటి తప్పిదాలే జరిగితే ముందు నేనే నిలదీస్తాను అని పేర్కొంది.