టాలీవుడ్ లో ఆ మద్య విజయ్ భూపతి దర్శకత్వంలో కొత్త హీరో కార్తికేయ నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ మంచి విజయం అందుకుంది. ఒక్క సినిమాతోనే కార్తికేయకు గొప్ప గుర్తింపు వచ్చింది. వెంటనే హిప్పీ సినిమాలో చాన్స్ రావడం ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడం జరిగింది. ప్రస్తుతం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ నటిస్తున్న తాజా మూవీ ‘గుణ 369’. కార్తియే సరసన అనగా హీరోయిన్ గా నటిస్తుంది.
ఆగస్ట్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీలో లవ్, యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ బాగా చూపించారు. ‘మనిషి రూపం వేరు..నిజస్వరూపం వేరు’ అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ మూవీ క్లయిమాక్స్ హైలెట్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపారు. చింతన్ భరద్వాజ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. ఈ మూవీని తిరుమల రెడ్డి, అనీల్ కడియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శీను చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.