వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న "డిస్కోరాజా" ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో దర్శకుడు, రవితేజ్ ఎనర్జీని ఫుల్ గా వాడుకుంటున్నాడట. పూరి తరువాత మళ్లీ రవితేజ్ ఎనర్జీని ఆ రేంజ్ లో వాడుతుంది వి.ఐ ఆనందే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెయిన్ గా ఈ సినిమాలో రవితేజ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండటంతో పాటు మంచి ఎంటర్ టైన్ గా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు 75 % షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట.
ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఇటీవలే తాన్యా హోప్ ను మూడో హీరోయిన్ గా ఎంపిక చేశారు. కాగా సినిమాలో తాన్యా హోప్ రోల్ కాస్త బోల్డ్ గా ఉంటుందట. ఆమె పై ఒక మసాలా సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.