రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా స్టారేనని నిరూపించుకున్న బాలీవుడ్ అగ్ర కధానాయకుడు.విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. సంపాదనలోనే కాదు, సహాయం చేయడంలోనూ తాను స్టారే అని నిరూపించుకున్నారు.


గతంలో నేపాల్ భూకంప, చెన్నై, కేరళ వరద బాధితులకు ఎక్కువ మొత్తంలో విరాళం ఇచ్చిన అక్షయ్.. తాజాగా అస్సాం వరద బాధితులకు రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును తెలియజేశారు. ఇందులో కోటి రూపాయాలను అస్సాం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వగా మరో కోటి రూపాయలను కజిరంగ నేషనల్ పార్క్‌కు విరాళంగా ఇచ్చి ఆయనకి జంతువుల మేద ఉన్న అభిమానాన్ని తెలిపారు.


భారీ వర్షాల కారణంగా అతలాకుతలమై వరదల కారణంగా దాదాపు 45 లక్షల మంది నిరాశ్రయులుకాగా అనేక మంది మరణించారు. యూనెస్కో గుర్తింపు పొందిన కజిరంగ నేషనల్ పర్క్ 90 శాతం నీట మునగడంతో అందులో ఉంటున్న మూగజీవాల పరిస్థతి దయనీయంగా మారింది అంటూ భాదపడ్డారు.


ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన అక్షయ్.. అస్సాంకు సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: