బుల్లితెరపై సూపర్ షో, ఎప్పుడు ట్రేండింగ్ లో ఉండే షో బిగ్ బాస్. సంవత్సరానికి కేవలం మూడూ నెలలు మాత్రమే ఈ షో ప్రేక్షకులకు కనిపిస్తుంది. కానీ ఈ షో కోసం సంవత్సరమంతా ప్రేక్షకులు ఎదురు చూస్తారు. అలానే సంవత్సరం పొడుగునా బిగ్ బాస్ పై గాసిప్స్ రాసేవాళ్ళు తక్కువ ఎం లేరులెండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో విల్లే కంటస్టెంట్లు, అతనే హోస్ట్ అని రాస్తునే ఉంటారు.


ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షో ఈ నెల 21వ తేదీన మొదలవనుంది. అయితే బిగ్ బాస్ కంటస్టెంట్ల లిస్ట్ కూడా ఇప్పటికి వెలువడాని సమయంలో ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా మహిళలను మోసం చేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారని బిగ్ బాస్ షో నిర్వహుకులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసందే. అయితే ఈ ఆరోపణలపై సమంత, చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 


ప్రేమ గురించి చెప్తూ మహిళలను చిన్న చిన్న మాటలు అన్నాకుడా స్పందించే ఫెమినిస్టులు, ప్రతి ఒక విషయాన్ని విమర్శించే మీరు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు ? మీపై దాడి జరిగితే ఒకలా, మరొకరిపై దాడి జరిగితే మరోలా స్పందిస్తారా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు బిగ్ బాస్ షో పై స్పందించడం లేదు, బిగ్ బాస్ లో మహిళలపై జరిగేవి నిజాలు కావా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: