అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో  యంగ్ హీరో కార్తికేయ, అనఘా హీరో హీరోయిన్లుగా  తెరకెక్కుతున్న చిత్రం "గుణ369".  కాగా  ఆగష్టు 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.  లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా  రానున్న ఈ చిత్రాన్ని  స్ప్రింట్ ఫిలిమ్స్,  జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌  పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో   "గుణ 369" టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. 


 ఈ సందర్భంగా ముందుగా   చిత్రబృందం మొత్తం రేపు వైజాగ్ వెళ్లనున్నారు.  వైజాగ్ లోని రెండు కాలేజీల్లో స్టూడెంట్స్ తో  తమ సినిమా సమతులు పంచుకోనున్నారు. రేపు  మధ్యాహ్నం 1 కి విజ్ఞాన్ కాలేజ్ కి,   3 గంటలకి రఘు కాలేజ్ లకు వెళ్లనున్నారు.  ఈ కథ వాస్తవ కథ అంట.   అర్జున్ జంధ్యాల చెప్పిన రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా   'గుణ 369'  సినిమాను చేస్తున్నాడు. మరి ఈ సారి కూడా కార్తికేయకి రియల్ స్టోరీ హిట్  ఇస్తోందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: