బుల్లితెర పై వస్తున్న బిగ్ బాస్ షో వివాదాస్పద నటి  మీరా మిథన్‌కు మద్రాసు హైకోర్టు నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో బిగ్‌బాస్‌ గేమ్‌షో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ అమ్మడిప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంది కాబట్టి.  ఇక మీరా మిథున్ పై చీటిక్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.   ఓ పూల వ్యాపారి ని మోసం చేసి 50 వేల రూపాయలు తీసుకుంది .


పూల వ్యాపారికి మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడంతో కేసు పెట్టాడు ఆ వ్యాపారి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ లోపు ఆమె చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. తనపై తప్పుడు కేసు పెట్టారని.. ప్రస్తుతం తాను షోలో ఉన్నానని.. బయటకు రాగానే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరింది. ఆమె కోరికను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కొన్ని నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. 


ఈ క్రమంలో ఆ మధ్యన నటి వనితా విజయ్‌కుమార్‌ను ఆమె కుమార్తె కేసు విషయంలో కలిసేందుకు తెలంగాణ పోలీసులు, చెన్నై పోలీసులు హౌస్‌లోకి విచారణకు వెళ్లారు. కానీ తాను తల్లి వద్దే ఉంటానని ఆమె కుమార్తె స్పష్టం చేయడంతో.. ఆ వివాదం కాస్త ముగిసింది. లేకపోతే ఈ కేసులో పోలీసులు వనితాను అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. అయితే వనిత కూడా ఇటీవల బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: