పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా లాభాల బాట పట్టింది. నైజాంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాను 7 కోట్ల పది లక్షలకు అమ్మగా ఇప్పటికే ఈ సినిమా 7కోట్ల 40 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఈ రోజుతో అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అవబోతుందని రేపటి నుండి ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లన్నీ లాభాలే అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీగా లాభాలు అందించిన సినిమా మరొకటి లేదు. రుపాయి పెట్టుబడికి రెండు రుపాయల లాభం అందిస్తోంది ఇస్మార్ట్ శంకర్ సినిమా. 
 
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 16 కోట్లకు అమ్మగా ఇప్పటికే 15 కోట్ల రుపాయలు వసూలు చేసినట్లు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా కాలం తరువాత నిర్మాతగా, దర్శకుడిగా రెండు విధాలుగా సక్సెస్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ అద్భుతంగా నటించాడని ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా హిట్టవ్వటంతో నభా నటేశ్, నిధి అగర్వాల్ ఇద్దరికీ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్లు సమాచారం అందుతుంది.
 
పూరీ జగన్నాథ్ తన తరువాత సినిమా కోసం బాలకృష్ణను సంప్రదించబోతున్నాడట. ఒకవేళ బాలకృష్ణ ఒప్పుకోకపోతే మాత్రం తన కొడుకు ఆకాశ్ తో ఒక సినిమా తీసి హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మొదలుపెట్టాలనుకుంటున్నాడట. హీరో రామ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని తరువాత సినిమా ఫైనల్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ దర్శకులు చెబుతున్న కథలు వింటున్నట్లు సమాచారం అందుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: