నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు మరో అదృష్టం కలిసొచ్చింది. ఆమె భర్త, దర్శకుడు సెల్వమణికి కీలక పదవి దక్కింది. ఆయన తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో గెలిచి.. అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. తోటి తమిళ దర్శకుడు విద్యాసాగర్‌పై 1386 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. సెల్వమణిని పలువురు సినీ ప్రముఖులు అభినందించారు. 


నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిని రోజా మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణాలతో ఆ పదవి దక్కలేదు. తర్వాత రోజా అసంతృప్తికి గురయ్యారు.. పార్టీ పెద్దలు మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఆమెను పిలిచి మాట్లాడారు. కొన్ని ఇబ్బందులు కారణంగానే మంత్రి పదవి దక్కలేదని సర్థి చెప్పారు. తర్వాత ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. మంత్రి పదవి రాకపోయినా.. నామినేటెడ్ పదవి ఆమెకు దక్కింది. కానీ ఆమె మాత్రం ఇష్టం లేకపోయినా.. అధినేత సూచనతో బాధ్యతలు స్వీకరించారు. 


రోజా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే సెల్వమణి కూడా తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించారు. ఇండస్ట్రీలో కీలకమైన సినీ దర్శకుల సంఘం అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. కాబట్టి రోజా వరుసగా రెండు గుడ్‌న్యూస్‌లు విన్నారు. ఇక ఇద్దరు తమ, తమ బాధ్యతలతో బిజీ కాబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: